సిరీస్ శ్రీలంకదే
రెండో టెస్టులో 215 పరుగులతో బంగ్లాదేశ్పై విజయం
ఢాకా: స్పిన్నర్లు అకిల ధనంజయ (5/24), రంగన హెరాత్ (4/49) మాయాజాలంతో... బంగ్లాదేశ్తో జరిగిన చివరిదైన రెండో టెస్టులో శ్రీలంక 215 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ‘డ్రా’గా ముగియడంతో... ఈ గెలుపుతో లంక 1–0తో సిరీస్ సొంతం చేసుకుంది. ఓవర్నైట్ స్కోరు 200/8తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 226 పరుగులకు ఆలౌటైంది. 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమవడంతో 123 పరుగులకే కుప్పకూలింది.
రెండు ఇన్నింగ్స్ల్లో అర్ధ శతకాలు చేసిన రోషన్ సిల్వాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఈ మ్యాచ్లో తైజుల్ ఇస్లామ్ వికెట్ తీయడం ద్వారా సీనియర్ స్పిన్నర్ రంగన హెరాత్ అత్యధిక వికెట్లు (415) పడగొట్టిన లెఫ్టార్మ్ బౌలర్గా ఘనత సాధించాడు. గతంలో పాక్ బౌలింగ్ దిగ్గజం వసీమ్ అక్రమ్ (414) పేరిట ఈ రికార్డు ఉంది. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టి20 సిరీస్ ఈనెల 15న మొదలవుతుంది.
సంక్షిప్త స్కోర్లు