ఢిల్లీ మ్యాచ్‌పై ఫిర్యాదు చేశాం.. కానీ

Sri Lanka cricket board complains to ICC on air pollution during Delhi Test  - Sakshi

ఢిల్లీ: భారత్‌తో ఇక్కడ జరిగిన మూడో టెస్టు సందర్బంగా వాయు కాలుష్యం తీవ్రంగా ఉన‍్నా తమ క్రికెటర్లను ఒత్తిడి చేసి ఆడించారని శ్రీలంక క్రికెట్‌ బోర్డు(ఎస్‌ఎల్‌సీ).. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)కి ఫిర్యాదు చేసింది.

'మా జట్టులోని నలుగురు ఆటగాళ్లు వాంతులు చేసుకున్నారు. ఇది చాలా పెద్ద విషయం. దీనిపై మంగళవారం ఐసీసీకి ఫిర్యాదు చేశాం. వాయు కాలుష్యంతో మా ఆటగాళ్లు సతమవుతుంటే ఆడటం కష్టమని కూడా తెలియజేసింది. మా ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఐసీసీ ఏ చర్యలు తీసుకుందో సరైన సమాచారం లేదు. మా క్రికెటర్లను బలవంతంగా ఒత్తిడి తెచ్చి ఆడించారనే సందేహం ఉంది' అని లంక క్రీడా మంత్రి దయాసిరి జయశేఖర విమర్శించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top