కేకేఆర్‌ విజయలక్ష్యం 173

SRH set target of 173 runs against KKR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జరుగుతున్నమ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, శ్రీవాత్స్‌ గోస్వామి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత గోస్వామి(35; 26 బంతుల్లో 4ఫోర్లు,1సిక్సర్‌)ని కుల్దీప్‌ పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చీ రావడంతోనే దూకుడుగా ఆడిన కెప్టెన్‌ విలియమ్సన్‌, ధావన్‌తో కలిసి భారీ స్కోర్‌ సాధించేలా కనిపించాడు.

కానీ సీర్లేస్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. విలియమ్సన్‌(36; 17బంతుల్లో 1ఫోర్‌, 3 సిక్సర్లు) ఔట్‌ కావడంతో మిగతా బ్యాట్స్‌మెన్‌ తడబడటంతో స్కోర్‌ బోర్డు నెమ్మదించింది. ఈ క్రమంలోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న శిఖర్‌ ధావన్‌(50;39 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్‌) మూడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత మనీష్‌ పాండే(25) మోస్తరుగా ఆడగా, మిగతా వారు నిరాశపరచడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top