ప్రాక్టీస్ సెషన్లో పాము
పల్లెకెలె: ప్రస్తుతం శ్రీలంకలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తొలి వన్డే వర్షం వల్ల రద్దు కాగా, రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలిచింది. అయితే మూడో వన్డే మ్యాచ్ను బుధవారం జరగాల్సి ఉంది.
ఈ క్రమంలోనే పల్లెకెలె స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఒకవైపు ప్రాక్టీస్ చేస్తుండగా, మరొకవైపు విషపూరిత పాము అనుకోని అతిథిలా వారి క్యాంప్లోకి వచ్చింది. దాంతో ఇంగ్లండ్ క్రికెటర్లు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ పామును ఇద్దరు వ్యక్తులు ఏదొకలా చేసి బయటకు తరిమేశారు. కాగా, ఈ వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్వీటర్లో పోస్ట్ చేసింది.
మరిన్ని వార్తలు