మెరిసిన మంధాన!
ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు
విల్లింగ్టన్ : న్యూజిలాండ్ మహిళలతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. 24 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో వేగవంతమైన అర్థ సెంచరీ నమోదు చేసి అసలు సిసలు టీ20 మజాను చూపించింది. తద్వార తన రికార్డు తానే మెరుగుపరుచుకుంది. మంధాన గతంలో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. తాజాగా 24 బంతుల్లో అందుకొని ఈ ఫీట్ సాధించిన ఐదో బ్యాటర్గా ఘనతకెక్కింది.
అంతకు ముందు టాస్ గెలిచిన భారత మహిళలు ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఆతిథ్య న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లోకి ప్రియాపునియా అరంగేట్రం చేయగా.. సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ను తుదిజట్టులోకి తీసుకోలేదు. 160 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన హర్మన్ సేనకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. అరంగేట్ర బ్యాటర్ ప్రియా(4) తీవ్రంగా నిరాశపర్చింది. అనంతరం జెమీమాతో కలిసి స్టార్ ఓపెనర్ మంధాన చెలరేగింది. రెండో వికెట్కు 98 పరుగుల జోడించిన అనంతరం అద్భత క్యాచ్కు మంధాన (58:34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) వెనుదిరిగింది.
మరిన్ని వార్తలు