ధావన్ రనౌట్ ఇలా...
అడిలైడ్: పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ రనౌటయ్యాడు. 29.5 ఓవర్ లో 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిస్బావుల్ హక్ విసిరిన బంతికి అతడు అవుటయ్యాడు. హరీస్ సొహైల్ బౌలింగ్ లో కోహ్లి బంతిని కొట్టాడు. వెంటనే ధావన్ ను పరుగుకు పిలిచాడు.
అయితే బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లడంతో వెనక్కి వెళ్లేందుకు ధావన్ ప్రయత్నించాడు. మిస్బా వెంటనే బంతిని వికెట్ల మీదకు విసరడంతో బౌలర్ సొహైల్ దాన్ని అందుకుని అవుట్ చేశాడు. మూడో అంపైర్ ధావన్ అవుటైనట్టుగా ప్రకటించడంతో అతడు మైదానాన్ని వీడాడు.