శిఖర్‌ ధావన్‌ అవుట్‌!

Shikhar Dhawan ruled out of the first Test against South Africa - Sakshi

కేప్‌టౌన్‌: ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ దూరమయ్యాడు. చీలమండ గాయంతో బాధపడుతున్న ధావన్‌.. తొలి టెస్టు నుంచి వైదొలగాల్సి వచ్చింది. మంగళవారం విరాట్‌ కోహ్లి-అనుష్కల వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యే క్రమంలో ధావన్‌ కాలికి పట్టీ కట్టుకుని కనిపించాడు. అయితే గాయంతోనే ధావన్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరినప్పటికీ,తొలి టెస్టు నుంచి వైదొలుగుతున్నట్లు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. దాంతో తొలి టెస్టు మ్యాచ్‌లో మురళీ విజయ్‌తో కలిసి కేఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడు.

బొలాండ్‌ పార్క్‌లో భారత్‌ ప్రాక్టీస్‌

దక్షిణాఫ్రికా సుదీర్ఘ పర్యటనలో టీమిండియాకు ఒక్క ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా లేదు. దాంతో బొలాండ్‌ పార్క్‌ సెంటర్‌ వికెట్‌పై ప్రాక్టీస్‌ చేసుకుంటామని టీమిండియా తాజా విజ్ఞప్తికి సఫారీ క్రికెట్‌ బోర్డు అంగీకారం తెలిపింది. అంతకుముందు తమ ప్రాకీస్‌ కోసం సెంటర్‌ వికెట్‌పై ప్రాక్టీస్‌ భారత మేనేజ్‌మెంట్‌ అభ్యర్థించినా అందుకు ఆమోదం లభించలేదు. కాగా, తాజాగా భారత క్రికెట్‌ బోర్డు చేసిన విన్నపానికి దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఆమోదం తెలపడంతో మన క్రికెటర్లకు సెంటర్‌ వికెట్‌పై ప్రాక్టీస్‌ చేసుకునే అవకాశం లభించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top