షేక్ హుమేరా జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: చండీగఢ్ లాన్టెన్నిస్ సంఘం (సీఎల్టీఏ) ఆధ్వర్యంలో జరిగిన ‘ద ట్రిబ్యూన్ కప్’ స్టేట్ టెన్నిస్ చాంపియన్షిప్లో హైదరాబాద్ ప్లేయర్ షేక్ హుమేరా ఆకట్టుకుంది. మహిళల డబుల్స్ కేటగిరీలో తన భాగస్వామి సాయి సంహిత (తమిళనాడు)తో కలిసి టైటిల్ను సాధించిన హుమేరా... సింగిల్స్లో రన్నరప్గా నిలిచింది.
చండీగఢ్లో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్సీడ్ షేక్ హుమేరా (తెలంగాణ)–సాయి సంహిత (తమిళనాడు) ద్వయం 6–4, 6–1తో సాయిదేదీప్య (తెలంగాణ)–కావ్య (యూపీ) జోడీపై గెలుపొందింది. సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ హుమేరా (తెలంగాణ) 6–7 (5/7), 2–6తో టాప్సీడ్ సాయి సంహిత (తమిళనాడు) చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది.