సెమీస్లో సానియా మీర్జా–షుయె పెంగ్ జంట
వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–షుయె పెంగ్ (చైనా) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనాలో గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సానియా–షుయె పెంగ్ ద్వయం 3–6, 6–3, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో అలీజా రోసోల్స్కా (పోలాండ్)–అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా) జంటపై విజయం సాధించింది.
75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు జోడీలు తమ సర్వీస్లను ఐదుసార్లు చొప్పున కోల్పోవడం గమనార్హం. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)–యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)లతో సానియా–షుయె పెంగ్ తలపడతారు.