‘ఒక్కరోజైనా ధోనీలా ఉంటే చాలు’
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన అభిమాన ఆటగాడని పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ సారథి సనా మీర్ అన్నారు. ‘వాయిస్ ఆఫ్ క్రికెట్ షో’ లో పాల్గొన్న సనా..‘ ఒక్కరోజు మన అభిమాన ఆటగాడిలా మారిపోయే అవకాశం దొరికితే నేనైతే.. గొప్ప కెప్టెన్లుగా పేరొందిన ధోనీ, ఇమ్రాన్ ఖాన్లా లాగా మారిపోతానంటూ’ చెప్పుకొచ్చారు. తను అభిమానించే ఆటగాళ్లలో వీరిద్దరిదీ ప్రత్యేక స్థానమని పేర్కొన్నారు. తన కెరీర్ గురించి ప్రస్తావిస్తూ నంబర్వన్ బౌలర్గా ఎదగడం వెనుక సహచర క్రీడాకారిణులు, సహాయక సిబ్బంది ప్రోత్సాహం ఉందన్నారు.
కాగా పాక్ మహిళా జట్టు టీ20, వన్డే కెప్టెన్గా వ్యవహరించిన సనా ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్ బౌలర్ అయిన సనా మంగళవారం కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకుకు చేరుకున్నారు. వన్డే, టీ20ల్లో కలిపి 212 వికెట్లు తీసి, 663 పాయింట్లతో ఐసీసీ వుమన్ బౌలర్ ర్యాంకింగ్స్లో టాప్లో కొనసాగుతున్నారు.