ఇకనుంచి విదేశాల్లో ఆ ఇద్దరు కీలకం: సచిన్
మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ భవిష్యత్లోనూ విదేశాల్లో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి జట్లు ఈ ఇద్దరిని ఎలా ఎదుర్కోవాలో అనే అంశంపై ప్రణాళికలు రచించుకుంటాయని అన్నాడు.
2019 వన్డే ప్రపంచకప్నకు మన జట్టు సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని సచిన్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఫిట్నెస్ పెంపునకు బీసీసీఐ తీసుకున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయని ప్రశంసించాడు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు