ఆడకపోతే పాక్కే లాభం: సచిన్
ముంబై : ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్పై నెలకొన్న సందిగ్ధంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. రెండు పాయింట్లు పోయినా పర్వాలేదు కానీ.. పాక్తో మాత్రం ఆడవద్దన్న డిమాండ్ సచిన్ తప్పుబట్టాడు. ప్రపంచకప్ టోర్నీలో పాక్తో భారత్ మ్యాచ్ రద్దు చేసుకుంటే అది వారికి లాభం చేకూరుస్తుందని ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డాడు.
‘ప్రపంచకప్లో టోర్నీల్లో ఇప్పటి వరకు భారత్కు మంచి రికార్డు ఉంది. ఈ సారి కూడా ఆడి పాక్ను ఓడించాలి. కానీ మ్యాచ్ను రద్దు చేసుకొని రెండు పాయింట్లు ఇవ్వడం సరైంది కాదు. ఇది వారికి టోర్నీలో మేలు చేస్తుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
కానీ ఓ భారతీయుడిగా దేశం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా. భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అండగా నిలబడతా’ అని ట్వీట్ చేశాడు. ఇక ఇదే అభిప్రాయన్ని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పాక్తో మ్యాచ్ భారత్ ఆడాలి.. ఓడించాలని ఆకాంక్షించారు.
— Sachin Tendulkar (@sachin_rt) February 22, 2019
సంబంధిత వార్తలు