‘రోహిత్ శర్మను ఓపెనర్గా ఆడించండి’
సిడ్నీ : ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టులో రోహిత్ శర్మని ఓపెనర్గా ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ను అభిమానులు కోరుతున్నారు. టెస్ట్ సిరీస్ సన్నాహకంలో భాగంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో శుక్రవారం ఫీల్డింగ్ చేస్తూ యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడి తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని స్థానంలో రోహిత్ శర్మని ఓపెనర్గా ఆడించాలని అభిమానులు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు.
వెస్టిండీస్తో అరంగేట్ర మ్యాచ్లో సెంచరీతో పృథ్వీషా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రాక్టీస్ మ్యాచ్లో సైతం.. పృథ్వీషా అదరగొట్టాడు. మంచి ఫామ్లో ఉన్న పృథ్వీషా గాయంతో దూరం కావడం కోహ్లిసేనకు ప్రతికూలాంశమే. అయితే పొట్టి ఫార్మాట్లో ఓపెనర్గా బ్యాటింగ్ చేసే రోహిత్ శర్మ.. టెస్టుల్లో మాత్రం సుదీర్ఘకాలంగా మిడిలార్డర్లోనే ఆడాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలం కావడంతో అతను టెస్టుల్లో చోటుకోల్పోయాడు. ఇటీవల ఆసియాకప్, వెస్టిండీస్ సిరీస్ల్లో తెల్లబంతితో రాణించడంతో మళ్లీ అవకాశం దక్కించుకున్నాడు. దీంతో అతనికి ఓపెనర్గా ఒక్క ఛాన్స్ ఇవ్వరా అని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
I would eager to see @ImRo45 open for india
— Maulik barot (@007_mak) 30 November 2018
@imVkohli please give one chance for Rohit Sharma as opener in test cricket .just try as this experiments
— Sudeepspoojary784 (@Sudeepspoojary2) 30 November 2018