అందుకే ఓడాం : రోహిత్ శర్మ
ముంబై : తప్పిదాలు చేయడంతోనే తొలి మ్యాచ్లో ఓటమి చవిచూశమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు .ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై 37 పరుగుల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. యువ ఆటగాడు రిషభ్పంత్ తమ విజయాన్ని లాగేసుకున్నాడని తెలిపాడు. ‘తొలి గేమ్ ఏ జట్టుకైనా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే జట్టులో చాలా మంది కొత్త ఆటగాళ్లు ఉంటారు. అయినా ఈ రోజు ఆటలో మేం చాలా తప్పిదాలు చేశాం. అందుకే ఓటమిపాలయ్యాం. తొలి 10 ఓవర్లు మా బౌలింగ్ బాగానే ఉంది. కానీ రిషబ్ పంత్ అద్భుతంగా ఆడాడు. మా లెంగ్త్ చేజారింది. ప్రణాళికలు సరిగ్గా అమలు కాలేదు. జట్టులోని కొత్త ఆటగాళ్లను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడ్తోంది. మేమంతా ఫ్రొఫెషనల్ క్రికెటర్స్ కాబట్టి త్వరగా మా తప్పిదాలను గుర్తించి తేరుకోగలం.
ఈ రోజు ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాం. పిచ్ పేసర్స్కు అనుకూలంగా ఉంటుందని స్పిన్నర్ను తీసుకోలేదు. మళ్లీ ప్రత్యర్థి జట్టులో చాలా మంది ఎడమ చేతి బ్యాట్స్మెన్ ఉండటంతో లెగ్ స్పిన్నర్ అవసరమా? అనిపించింది. మేం టోర్నిలో ఎలా ముందుకు సాగాలో మాకు స్పష్టత ఉంది. తరువాతి మ్యాచ్ల్లో ప్రత్యర్థులను బట్టి మా జట్టు కూర్పు ఉంటుంది. ఈ మ్యాచ్లో పిచ్ బ్యాటింగ్కు అనుకూలించింది. యువరాజ్ అద్భుతంగా ఆడాడు. మేం ఇంకో 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే పరిస్థితి వేరేలా ఉండేది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
సంబంధిత వార్తలు