రోహిత్‌ సరికొత్త రికార్డు

Rohit Creates New Record for Most T20I Runs - Sakshi

ఆక్లాండ్‌: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో రోహిత్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క‍్రమంలోనే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఇక్కడ మార్టిన్‌ గప్టిల్‌ రికార్డును రోహిత్‌ అధిగమించాడు. ప‍్రస్తుతం రోహిత్‌(2,288) తొలి స్థానాన్ని ఆక్రమించగా, గప్టిల్‌(2277) రెండో స్థానంలో ఉన్నాడు. షోయబ్‌ మాలిక్‌(2263) మూడో స్థానంలో, విరాట్‌ కోహ్లి(2167)లు నాల్గో స్థానంలో ఉన్నారు.

అదే సమయంలో రోహిత్‌ మరొక రికార్డును నెలకొల‍్పడం ఇక్కడ మరో విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో యాభై అంతకంటే ఎక్కువ పరుగుల్ని అత్యధిక సార్లు సాధించిన ఆటగాడిగా రోహిత్‌ మరో రికార్డు సాధించాడు. తాజా హాఫ్‌ సెంచరీతో రోహిత్‌ శర్మ యాభై అంతకంటే ఎక్కువ పరుగుల్ని 20 సార్లు సాధించాడు. దాంతో విరాట్ కోహ్లి(19 సార్లు) రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో రోహిత్‌ అర్థ శతకం సాధించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top