ఐదు ఓవర్లలో రాజస్థాన్ స్కోరు 27/0
విశాఖపట్నం: ఐపీఎల్ -8లో భాగంగా ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఐదు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 27పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. 128 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ ఇన్నింగ్స్ ను అజ్యింకా రహానే(16), సంజూ శాంసన్(8) లు నెమ్మదిగా ముందుకు తీసుకువెళుతున్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 35 పరుగులకే మూడు ప్రధాన వికెట్లను కోల్పోవడంతో హైదరాబాద్ స్కోరు బోర్డు నెమ్మదించింది. ఏ ఒక్క ఆటగాడు కనీసం ప్రతిఘటించకపోవడంతో సన్ రైజర్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. హైదరాబాద్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ (21), శిఖర్ ధావన్ (10), కేఎల్ రాహుల్(2) , నమాన్ ఓజా(25),ఇయాన్ మోర్గాన్(27) పరుగులు చేసి పెవిలియన్ కు చేరి అభిమానుల్ని నిరాశపరిచారు.