భారత స్పీడ్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా రఘు

Raghu Takes over as Indian Speed Ball Captain - Sakshi

హైదరాబాద్‌: అంతర్జాతీయ స్పీడ్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్‌ క్రీడాకారులు ముగ్గురికి చోటు దక్కింది. బోరబండ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన రఘు, మెషక్, కరుణాకర్‌ ఆయా వయోవిభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. అండర్‌–14 జట్టుకు ఎంపికైన రఘు.. కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్నాడు.

భారత అండర్‌–19 బాలుర జట్టుకు మెషక్, అండర్‌–17 బాలుర జట్టులో కరుణాకర్‌ చోటు దక్కించుకున్నారు. నేపాల్‌లోని మహేందర్‌నగర్‌లో ఈనెల 25, 26 తేదీల్లో అంతర్జాతీయ స్పీడ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ జరుగనుంది. తమ పాఠశాల నుంచి ముగ్గురు క్రీడాకారులు జాతీయ జట్టుకు ఎంపికవడం పట్ల పీఈటీ నాసర్‌ హర్షం వ్యక్తం చేశారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top