పంజాబ్ లక్ష్యం 173
మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 173 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ లెవెన్ పంజాబ్కు నిర్దేశించింది. ఇక్కడి పీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 172 పరుగులు చేసింది.
ముంబై ఓపెనర్లు సిమన్స్ (71), పార్థివ్ పటేల్ (59) హాఫ్ సెంచరీలతో రాణించారు. పార్థివ్ 32 బంతుల్లో, సిమన్స్ 38 బంతుల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్కు 111 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు శుభారంభాన్నందించారు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 26 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లు అనురీత్ సింగ్, మిచెల్ జాన్సన్, కరణ్వీర్ సింగ్ తలా వికెట్ తీశారు.