జడేజా రెస్టారెంట్‌లో కల్తీ ఫుడ్‌..

poor hygienic food found in jadeja's restarant

సాక్షి, గుజరాత్ ‌: భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజాకు ఊహించని జలక్‌ తగిలింది. రాజ్‌కోట్‌లో జడేజాకు చెందిన జడ్డూస్‌ ఫుడ్‌ ఫీల్డ్‌ రెస్టారెంట్‌లో కల్తీ ఆహారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  కస్టమర్ల  ఫిర్యాదుల మేరకు ఆరోగ్య శాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది.

జడేజా సోదరి నయానా అనిరుద్ధీన్‌ జడేజా ఈ రెస్టారెంట్‌కు యాజమానిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆమెకు నోటీసులు జారీచేశామని అధికారులు తెలిపారు. డిప్యూటి హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పీపీ రాథోడ్‌ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఆహార పధార్థాలలో కృత్రిమ రంగులు వాడుతున్నట్లు నిర్థారించామని, అలాగే చాలా కాలం నిల్వ ఉన్న బేకరీ పదార్ధాలు అమ్ముతున్నట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు.  

జేఎఫ్‌ఎఫ్‌తోపాటు మరికొన్ని రెస్టారెంటుల్లో కూడా తనిఖీలు చేశామని చెప్పారు. జడేజా ఈ రెస్టారెంట్‌ని 2012లో ప్రారంభించగా గత ఏడాది చివరలో ఇది అక్రమ నిర్మాణమని అధికారులు నోటీసులు జారీచేశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top