పొలార్డ్, స్టార్క్లపై జరిమానా
ముంబై: ముంబై, బెంగళూరుల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో పరస్పరం గొడవకు దిగిన బ్యాట్స్మన్ పొలార్డ్, పేసర్ మిచెల్ స్టార్క్లపై జరిమానా విధించారు. పొలార్డ్ మ్యాచ్ ఫీజులో 75 శాతం, స్టార్క్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది.
స్లో ఓవర్రేట్ కారణంగా ఇరుజట్ల కెపెన్లు రోహిత్ శర్మకు రూ. 24 లక్షలు; కోహ్లికి రూ. 12 లక్షలు జరిమానాగా వేశారు. ఈ సీజన్లో ముంబై స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇది రెండోసారి. దీంతో రోహిత్కు రెట్టింపు జరిమానా పడింది. అలాగే ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ వేశారు.
సంబంధిత వార్తలు