కోహ్లి ప్రశాంతంగా ఉండటమా?
బ్రిస్బేన్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తమతో జరగబోయే సిరీస్లో ప్రశాంతంగా ఉంటాడని అనుకోవడం లేదని ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు. ఆసీస్ పర్యనటనకు టీమిండియా బయల్డేరేముందు మాటలో పొదుపు పాటిస్తానని కోహ్లి పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కమిన్స్ మాట్లాడుతూ.. కోహ్లి ప్రశాంతంగా ఉంటాడనేది వాస్తవానికి దూరంగా ఉందన్నాడు. ఒకవేళ ఆసీస్ పర్యటనలో కోహ్లి దూకుడుగా ఉండకుండా ఉంటే అది తనను కచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నాడు. ‘ కోహ్లి మీడియాతో మాట్లాడుతూ కాంపిటేటివ్గా ఉంటానని చెప్పడాన్ని నేను విన్నాను. అది నన్ను కాస్త ఆలోచింపజేసింది. ఒకవేళ కోహ్లి తన శైలికి భిన్నంగా ఉంటే అది నన్ను ఆశ్చర్యపరచడం ఖాయం’ అని కమిన్స్ తెలిపాడు.
ఇరు జట్ల మధ్య జరగబోయే ఈ ద్వైపాక్షిక సిరీస్ ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. తమకు ఒకరు ఎక్కువ..మరొకరు తక్కువ అనేది ఏమీ ఉండదని, ప్రత్యర్థి జట్టు మొత్తాన్ని ఒకే విధంగా చూస్తామన్నాడు.
సంబంధిత వార్తలు