చెలరేగిన పంత్‌

Pant blitz powers Delhi Capitals to 213 against Mumbai Indians - Sakshi

ముంబై: ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆదిలోనే పృథ్వీషా(7) వికెట్‌ను కోల్పోయింది. ఆపై కాసేపటికి శ్రేయస్‌ అయ్యర్‌(16) కూడా పెవిలియన్‌ చేరడంతో ఢిల్లీ 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో శిఖర్‌ ధావన్‌-ఇన్‌గ్రామ్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 83 పరుగులు జత చేయడంతో ఢిల్లీ గాడిలో పడింది.

అయితే ధావన్‌(43: 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఇన్‌గ్రామ్‌(47: 32బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్‌)లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ అయ్యారు.  ఆపై రిషభ్‌ పంత్‌ తన బ్యాట్‌కు పని చెప్పాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్‌.. అటు తర్వాత మరింత వేగంగా ఆడాడు. 27 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్పర్లతో అజేయంగా 78 పరుగులు చేశాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లీన్‌గాన్‌ మూడు వికెట్లు సాధించగా, బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, బెన్‌ కట్టింగ్‌లు తలో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top