టి20 సిరీస్ కూడా పాకిస్తాన్దే
అబుదాబి: శ్రీలంకపై వన్డే సిరీస్ను 5–0తో క్లీన్స్వీప్ చేసిన పాకిస్తాన్ జట్టు టి20 సిరీస్నూ కైవసం చేసుకుంది. శ్రీలంకతో శుక్రవారం రాత్రి జరిగిన రెండో టి20 మ్యాచ్లో పాకిస్తాన్ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. శ్రీలంక నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని పాక్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి అందుకుంది.
పాక్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా... సర్ఫరాజ్ (28), షెహజాద్ (27), షాదాబ్ (8 బంతుల్లో 16 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి దోహదపడ్డారు. ఈ గెలుపుతో మూడు టి20 మ్యాచ్ల సిరీస్ను పాక్ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. మూడో టి20 నేడు లాహోర్లో జరుగుతుంది.