'ఆ వార్తల్లో నిజం లేదు'
ఢిల్లీ: ఈ నెల 12న తన ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వివాహం చేసుకోబోతున్నాడన్న వార్తల్లో నిజం లేదని అనుష్క మేనేజర్ స్పష్టం చేశాడు. మీడియాలో వారిద్దరి పెళ్లికి సంబంధించి వస్తున్న తాజా వార్తలను ఆయన ఖండించారు. అందులో ఎంత మాత్రం వాస్తవం లేదని.. అవి కేవలం రూమర్లు మాత్రమేనని తెలిపారు.
విరాట్-అనుష్కల వివాహం మరో వారంలోపే జరుగనుందనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వేడుక ఇటలీలో జరగనుందని, ఇందుకోసం కోహ్లీ గురువారమే ఇటలీ బయల్దేరుతున్నాడన్న ప్రచారం జరిగింది. దానిలో భాగంగానే శ్రీలంకతో వన్డే సిరీస్ నుంచి విరాట్ విశ్రాంతి తీసుకోవడానికి ప్రధాన కారణంగా వార్త హల్చల్ చేసింది. కాగా, ఆ వార్తలపై స్పందించిన అనుష్క మేనేజర్ అందులో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. అవన్నీ రూమర్స్ మాత్రమేనంటూ కొట్టిపారేశారు. దాంతో గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న వారిద్దరూ ఎప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు