టాస్ గెలిచిన న్యూజిలాండ్
కాన్పూర్ : భారత్-న్యూజిలాండ్ల మధ్య వన్డే సిరీస్లో భాగంగా కాన్పూర్లో జరగుతున్న మూడో వన్డేలో విలియమ్సన్ సేన టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. రెండు వన్డేల్లో చెరొకటి విజయం సాధించడంతో సిరీస్ నెగ్గడంపై ఇరు జట్లు దృష్టి సారించాయి. మరో వైపు రెండో వన్డేలో బౌలర్లు సమిష్టిగా రాణించడం భారత్కు కలిసొచ్చే అంశంగా కనబడుతోంది.
తుది జట్లు:
భారత్ : కోహ్లి (కెప్టెన్), ధావన్, ధోని, రోహిత్, భువనేశ్వర్, చాహల్, పాండ్యా, బుమ్రా, దినేశ్ కార్తిక్, జాదవ్, ఏఆర్ పటేల్
న్యూజిలాండ్ : కేన్ విలియమ్సన్, బౌల్ట్, గప్టిల్, సౌథీ, లాథమ్, మున్రో, టేలర్, నికోల్స్, డీ గ్రాండ్హోమ్, మిల్నే, శాట్నర్
మరిన్ని వార్తలు