కివీస్తో టీ20: టీమిండియా ఘోర పరాజయం
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 80 పరుగుల తేడాతో ఘోరపరాజయం చవిచూసింది. కివీస్ బౌలర్ల ధాటికి 19.2ఓవర్లలో 139 పరుగులకే రోహిత్ సేన ఆలౌటయింది. టీమిండియా సీనియర్ ఆటగాడు ధోని (39), ధావన్(29), విజయ్ శంకర్(27), కృనాల్(20)లు తప్ప మిగతా బ్యాట్స్మన్ రాణించకపోవడంతో భారత్కు పరాజయం తప్పలేదు. టీమిండియా తాత్కాలిక సారథి, ఓపెనర్ రోహిత్ శర్మ(1) దారుణంగా విఫలమయ్యాడు. రోహిత్ విఫలమైన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ దాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.
కానీ కివీస్ బౌలర్ ఫెర్గుసన్ బౌలింగ్లో ధావన్(29) క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. టీమిండియా నయా సంచలన ఆటగాడు పంత్(1)కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. స్కోర్ పెంచే క్రమంలో విజయ్ శంకర్(27) కూడా క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అనంతర క్రీజులోకి వచ్చి రాగానే బౌండరీ బాది ఆశలు రేపిన పాండ్యా(4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. ధోనితో కలిసి టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేసిన కృనాల్(20) కూడా కీపర్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. చివర్లో ధోని(39), భువనేశ్వర్(1), చహల్(1)లు వెంటవెంటనే వెనుదిరగడంతో తొలి టీ20లో టీమిండియా కథ ముగిసింది. కనీస పోరాట పటిమను ప్రదర్శించకుండా టీమిండియా బ్యాట్స్మెన్ చేతులెత్తేయడం పట్ల అభిమానులను నిరాశ పరిచింది.
సంబంధిత వార్తలు