టీమిండియా లక్ష్యం 159

New Zealand Set Target of 159 Runs Against India - Sakshi

ఆక్లాండ్‌: టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్‌ 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ తీసుకున్న కివీస్‌ ఆదిలోనే కీలక వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు టీమ్‌ సెఫార్టీ(12), కొలిన్‌ మున్రో(12)లు నిరాశపరిచారు.  దాంతో 41 పరుగుల వద్ద కివీస్‌ రెండు వికెట్లు నష్టపోయింది. కాగా, మరో 9 పరుగుల వ్యవధిలో డార్లీ మిచెల్‌(1), కేన్‌ విలియమ్సన్‌(20)ఔట్ కావడంతో కివీస్‌ కష్టాల్లో పడింది. ఆ తరుణంలో రాస్‌ టేలర్‌-గ్రాండ్‌ హోమ్‌ల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 77 పరుగులు జోడించడంతో కివీస్‌ తేరుకుంది.

కాగా, గ్రాండ్‌హోమ్‌(50; 28 బంతుల్లో 1ఫోర్, 4 సిక్సర్లు) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత ఇన‍్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను రాస్‌ టేలర్‌ తీసుకున్నాడు. టేలర్‌ 36 బంతుల్లో 3 ఫోర్లతో 42 పరుగులతో రాణించాడు. టేలర్‌, సాన్‌ట్నర్‌(7)లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో కివీస్‌ స్కోరులో వేగం తగ్గింది. ఆపై టిమ్‌ సౌతీ(3) కూడా నిరాశపరచడంతో కివీస్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భారత బౌలర‍్లలో కృనాల్‌ పాండ్యా మూడు వికెట్లు సాధించగా, ఖలీల్‌ అహ్మద్‌ రెండు వికెట్లు తీశాడు. భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్‌లకు తలో వికెట్‌ దక్కింది.

ఇక్కడ చదవండి: అది ఔట్‌ ఎలా ఇస్తారు:? కేన్‌ అసంతృప్తి

కివీస్‌తో టీమిండియా అమీతుమీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top