సింధును స్ఫూర్తిగా తీసుకోవాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ సాధించిన బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధుపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ‘సింధు జాతి గర్వపడేలా చేసింది. ఆటపై ఆమె అంకితభావం, కఠోర శ్రమ, నిబద్ధత అద్భుతం.
ఆమెను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి’ అని అన్నారు. ఆమె తన తల్లిదండ్రులు విజయ, రమణలతో కలిసి ఉపరాష్ట్రపతిని కలిసింది. ఈ సందర్భంగా సింధును వెన్నంటి ప్రోత్సహించిన వారిని అభినందించారు. పిల్లలు ఆటల్లో రాణించేలా తల్లిదండ్రులు సహకారం అందించాలని సూచించారు.
మరిన్ని వార్తలు