టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్
ముంబై: ఐపీఎల్లో భాగంగా ఇక్కడ ఆదివారం వాంఖేడే స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత ఢిల్లీని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్ మూడుసార్లు టైటిల్ సాధించగా, ఢిల్లీకి ఇంకా అది అందని ద్రాక్షగానే ఉంది. దాంతో ఆరంభపు మ్యాచ్ నుంచి పైచేయి సాధించాలనే శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది.
మరిన్ని వార్తలు