ముంబై ప్రతీకారం తీర్చుకునేనా?
ఢిల్లీ: ఐపీఎల్లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేయడానికి మొగ్గుచూపాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్లు ఎనిమిది మ్యాచ్లు ఆడి చెరో ఐదు మ్యాచ్లు గెలిచాయి. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో ఢిల్లీ 37 పరుగులు తేడాతో విజయం సాధించింది.
దాంతో ముంబై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుండగా, ఢిల్లీ మరోసారి పైచేయి సాధించాలనే యోచిస్తోంది. సొంత మైదానంలో జరిగే మ్యాచ్ కావడంతో ఢిల్లీ విజయంపై ధీమాగా ఉంది. ఈ మ్యాచ్లో ముంబై బెన్ కట్టింగ్, జయంత్ యాదవ్లను జట్టులోకి తీసుకోగా, ఢిల్లీ ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమవుతోంది.
ముంబై
రోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య, పొలార్డ్, హార్దిక్ పాండ్య, జయంత్ యాదవ్, రాహుల్ చహర్, బెన్ కట్టింగ్, లసిత్ మలింగా, బుమ్రా
ఢిల్లీ
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, కొలిన్ మున్రో, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, క్రిస్ మోరిస్, కీమో పాల్, రబడ, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు