మళ్లీ చెన్నై జెర్సీలో కనిపించనున్న మహీ

MS Dhoni all set to return for Chennai Super Kings in 2018 Indian Premier League - Sakshi

న్యూఢిల్లీ : భారత క్రికెట్‍ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మళ్లీ చెన్నై జెర్సీని ధరించనున్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ధోని ఆడటానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ బుధవారం ఆమోదం తెలిపింది.

నిబంధనల ప్రకారం ప్రతి ఏటా ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లకు వేలం నిర్వహిస్తారు. ఇందులో తమకు కావాల్సిన వారిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేసుకుంటాయి. అయితే, ఐదుగురు ఆటగాళ్లను మాత్రం వేలానికి వెళ్లకుండా ఉంచుకునేందుకు ఫ్రాంచైజీలకు అవకాశం ఇచ్చారు. ఈ నిబంధన కారణంగా 2018లో రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్లు పూర్వం తమ తరఫున ఆడిన ఆటగాళ్లను మళ్లీ తెచ్చుకునేందుకు వీలు కలిగింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top