తొలి రౌండ్లోనే శ్రీకాంత్ ఓటమి
మకావు ఓపెన్
మకావు: మకావు ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్సీడ్, భారత స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే షాక్ తిన్నాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్లో శ్రీకాంత్ 16-21, 21-23తో క్రిస్టి జోనాథన్ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. ఇతర మ్యాచ్ల్లో ఏడోసీడ్ హెచ్.ఎస్. ప్రణయ్ 21-15, 16-21, 21-18తో సుక్తా ఎవర్ట్ (ఇండోనేసియా)పై; 9వ సీడ్ అజయ్ జయరామ్ 21-6, 25-23తో టామ్ చున్ హీ (హాంకాంగ్)పై; 15వ సీడ్ సాయి ప్రణీత్ 21-18, 23-21తో ఫిక్రి అహ్మది (ఇండోనేసియా)పై గెలిచి రెండోరౌండ్లోకి అడుగుపెట్టారు.