సఫారీ వన్డే జట్టు ఇదే..
డర్బన్:టీమిండియాతో వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. వన్డే జట్టులో టెస్టుల్లో ఆకట్టుకున్న పేసర్ లుంగీ ఎన్గిడికి చోటు కల్పిస్తూ సఫరీ సెలక్టర్టు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం ప్రకటించిన 15 మందితో కూడిన వన్డే జట్టులో క్రిస్ మోరిస్, మోర్నీ మోర్కెల్లు తిరిగి చోటు దక్కించుకున్నారు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆరు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్లోనూ డు ప్లెసిస్ సారథిగా వ్యవహరిస్తాడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
దక్షిణాఫ్రికా వన్డే జట్టు: డు ప్లెసిస్(కెప్టెన్), హషీమ్ ఆమ్లా, డీ కాక్, ఏబీ డివిలియర్స్, జేపీ డుమిని, ఇమ్రాన్ తాహీర్, మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, మోర్నీ మోర్కెల్, క్రిస్ మోరిస్, ఎన్గిడి, ఫిహ్లుకోవా, రబడా, తబ్రైజ్ షమ్సి, జాండో
మరిన్ని వార్తలు