టెస్టుల గురించి ఆందోళన చెందను: రోహిత్ శర్మ
కెరీర్ ఆరంభంలో టెస్టు క్రికెట్ గురించి అతిగా ఆలోచిస్తూ తాను అనవసరంగా ఆందోళన చెందానని, ఇకపై అలాంటి వాటికి చోటివ్వనని భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. తనకు అందుబాటులో ఉన్న అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకోవడంపైనే దృష్టి పెట్టానని, టెస్టుల్లో చోటు దక్కడం గురించి ఆలోచించి సమస్యను సంక్లిష్టం చేసుకోనని అతను చెప్పాడు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్గా ముద్ర పడ్డ రోహిత్ భారత్ ఆడిన గత 45 టెస్టుల్లో 22 మ్యాచ్లలో మాత్రమే అవకాశం దక్కించుకోగలిగాడు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు