అతని కోసం నిద్రలేని రాత్రులు..: భజ్జీ
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచమంతా ఫుట్బాల్ ఫీవర్తో ఊగిపోతోంది. రెండు రోజుల క్రితం రష్యా వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్కప్ పైనే అందరి దృష్టి ఉంది. ఈ క్రమంలో దేశదేశాల్లో ఫుట్బాల్ ప్రేమికులు తాము ఎంతగానో ఆదరించే ఆటగాళ్లపై అభిమానాన్ని గొప్పగా చాటుకుంటున్నారు. భారత్లోనూ ఈ ఫుట్బాల్ ఫీవర్ పెరిగిపోయింది. ముఖ్యంగా స్టార్ ఫుట్బాల్ ఆటగాళ్లపై ఇక్కడ వారంతా మాటల్లో చెప్పలేనంత అభిమానాన్ని కనబరుస్తున్నారు. ఇందుకు భారత క్రికెటర్ హర్భజన్ సింగే ఉదాహరణ? అర్జెంటీనా ఆటగాడు లియెనాల్ మెస్సీ కోసం నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందంటూ హర్భజన్ సింగ్ ట్వీటర్ ద్వారా అభిమానాన్ని చాటుకున్నాడు.
‘ఇప్పటి నుంచి దాదాపు నెల రోజుల వరకూ మెస్సీ కోసం నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ‘గో మెస్సీ గో..’ అంటూ ట్వీట్ చేశాడు. మెస్సీ అభిమానుల జాబితాలో కేరళ మంత్రి ఎం.ఎం మణి కూడా ఉన్నారు. తాజాగా ఆయన ప్రపంచకప్లో అర్జెంటీనాకే తన మద్దతంటూ.. అందులోనూ మెస్సీ అంటే తనకు ఎంతో ప్రత్యేకమంటూ.. లుంగీపై ఆ జట్టు జెర్సీ ధరించి ఫుట్బాల్ ఆడారు. ఈ ప్రపంచకప్లో గ్రూపు-డిలో ఉన్న అర్జెంటీనా టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటి. అర్జెంటీనా తన తొలి మ్యాచ్లో శనివారం ఐస్లాండ్తో తలపడనుంది.
సంబంధిత వార్తలు