'మహి'మ పనిచేసింది..!
డర్బన్:దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్లో శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పాత్ర వెలకట్టలేనిది. చివరినిమిషంలో జట్టులో చోటు దక్కించుకున్న కుల్దీప్ యాదవ్ మూడు కీలక వికెట్లు సాధించి టీమిండియా గెలుపులో ముఖ్య భూమిక పోషించాడు.
అయితే దక్షిణాఫ్రికా పిచ్లపై ఎలా బౌలింగ్ చేయాలన్న సందిగ్థతలో ఉండగా, దాన్ని ధోని తొలగించాడని కుల్దీప్ పేర్కొన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేయాలన్న ధోని సలహా తనకు ఎంతగానో ఉపయోగపడిందన్నాడు. ధోని సలహా పాటించి తాను వికెట్లు సాధించానని కుల్దీప్ చెప్పాడు. మ్యాచ్ ఆసాంతం వికెట్ల వెనుకనుంచి ధోనీ తనకు సలహాలు ఇస్తూనే ఉన్నాడని ఈ సందర్భంగా కుల్దీప్ గుర్తుచేసుకున్నాడు.