కుల్దీప్ యాదవ్ సరికొత్త రికార్డు
బ్రిస్బేన్: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆసీస్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఈ చైనామన్ బౌలర్ రెండు వికెట్లు తీశాడు. అరోన్ ఫించ్, క్రిస్ లిన్ వికెట్లను కుల్దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా 31వ అంతర్జాతీయ టీ20 వికెట్ను కుల్దీప్ సాధించాడు. ఈ క్రమంలోనే తొలి 15 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో అత్యధిక వికెట్లను సాధించిన ఘనతను కుల్దీప్ సొంతం చేసుకున్నాడు. తద్వారా అజంతా మెండిస్(శ్రీలంక) రికార్డును కుల్దీప్ బ్రేక్ చేశాడు. తొలి 15 టీ20 మ్యాచ్ల్లో మెండిస్ 29 వికెట్లు సాధించగా, దాన్ని తాజాగా కుల్దీప్ అధిగమించాడు. తొలి 15 అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కుల్దీప్, మెండిస్లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, చాహల్(27) మూడో స్థానంలో ఉన్నాడు.
ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 17 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి పరాజయం చెందింది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు