టాస్ గెలిచిన కేకేఆర్
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా మంగళవారం ఇక్కడ ఈడెన్ గార్డెన్లో రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్.. ముందుగా రాజస్తాన్ రాయల్స్ను బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరాడు. ఈ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఇష్ సోధీ, అనిరుధ్ సింగ్, రాహుల్ త్రిపాఠీలు రాజస్తాన్ తుది జట్టులోకి వచ్చారు. అదే సమయంలో కేకేఆర్ ఒక మార్పుతో పోరుకు సిద్ధమైంది. పీయూష్ చావ్లా స్థానంలో శివం మావి జట్టులో చోటు దక్కించుకున్నాడు.
అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో కేకేఆర్ విజయం సాధించింది. ఇప్పటివరకూ ఇరు జట్లు 12 మ్యాచ్లు ఆడి తలో ఆరు మ్యాచ్ల్లో గెలుపును సొంతం చేసుకున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ రేసుకు మరింత చేరువ కానుంది.
తుది జట్లు
రాజస్తాన్ రాయల్స్
అజింక్యా రహానే(కెప్టెన్), జోస్ బట్లర్, సంజూ శాంసన్, బెన్ స్టోక్స్, రాహుల్ త్రిపాఠి, స్టువర్ట్ బిన్నీ, జోఫ్రా ఆర్చర్, కృష్ణప్ప గౌతమ్, జయదేవ్ ఉనాద్కత్, ఇష్ సోధీ, అనురిత్ సింగ్
కేకేఆర్
దినేశ్ కార్తీక్(కెప్టెన్), క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, శుభ్మాన్ గిల్, సీర్లెస్, ప్రసిధ్ కృష్ణ, శివం మావి, కుల్దీప్ యాదవ్
సంబంధిత వార్తలు