‘ఐపీఎల్‌ ఏర్పాట్లపై చేయాల్సింది చాలా ఉంది’ 

Kane Williamson Speaks About IPL 2020 Arrangements - Sakshi

మౌంట్‌ మాంగనీ: యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహించాలనే ప్రతిపాదనను న్యూజిలాండ్‌ కెప్టెన్, సన్‌రైజర్స్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ స్వాగతించాడు. అయితే టోర్నీ నిర్వహణకు చేయాల్సిన  కసరత్తు ఇంకా చాలా ఉందన్నాడు. ‘ఐపీఎల్‌ ఏర్పాట్ల నుంచి ఆటగాళ్ల ఆరోగ్యం తదితర అంశాల వరకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకునే ముందు క్వారంటైన్‌ సహా ఎన్నో అంశాలు చక్కబెట్టాల్సి ఉంది. ఇవన్నీ ఎలా చేస్తారో నాకైతే తెలీదు. అయితే ఐపీఎల్‌లో ఆడటాన్ని నేను బాగా ఆస్వాదిస్తాను’ అని విలియమ్సన్‌  అన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top