కెప్టెన్‌గా జేపీ డుమినీ

JP Duminy to Lead South africa in T20I Series - Sakshi

కేప్‌టౌన్‌:భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా త్వరలో ఆరంభం కానున్న టీ 20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా జేపీ డుమినీని ఎంపిక చేశారు. ఈ మేరకు 14 మందితో కూడిన జట్టును మంగళవారం దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు సారథిగా డుమినీకి నాయకత్వ బాధ్యతల్ని అప్పచెబుతూ నిర్ణయం తీసుకుంది. సఫారీ రెగ్యులర్‌ కెప్టెన్‌ డు ప్లెసిస్‌ గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో డుమినిని కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

మరొకవైపు బ్యాట్స్‌మన్‌ క్రిస్టియన్‌ జోంకర్‌, ఫాస్ట్‌ బౌలర్‌ జూనియర్‌ డాలాలకు తొలిసారి సఫారీ జట్టులో చోటు దక్కించుకోగా, ఇటీవల భారత్‌తో జరిగిన నాల్గో వన్డేలో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన హెన్రిచ్‌ క్లాసెన్‌కు కూడా టీ 20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా, లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌కు టీ 20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఉన్న తరుణంలో తాహీర్‌కు విశ్రాంతి కల్పించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top