అయ్యర్, డుమిని బాదుడే బాదుడు
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఓపెనర్ శ్రేయాస్ సంతోష్ అయ్యర్, కెప్టెన్ డుమిని అర్ధ సెంచరీలు సాధించారు. డుమిని 36 బంతుల్లో 4 సిక్సర్లు, ఫోర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంతకు ముందు అయ్యర్ కూడా అర్ధసెంచరీ బాదాడు. 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.
అయ్యర్, డుమిని విజృంభణతో ఢిల్లీ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ముంబై బౌలర్లను వీరిద్దరూ ఎడాపెడా బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వరద పారించారు. అయ్యర్ 80, డుమిని 60 పరుగులతో ఆడుతున్నారు. వీరిద్దరి జోరుతో 16 ఓవర్ లో ఢిల్లీ స్కోరు 150 పరుగులు దాటింది.