షమీ విజృంభణ.. జడేజా మ్యాజిక్‌

Jadeja Rattles South Africa With Quick wickets - Sakshi

విశాఖ: టీమిండియా నిర్దేశించిన 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది.  ఆదివారం చివరిరోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా 70 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. 11/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆటను కొనసాగించిన సఫారీలు వరుసగా కీలక వికెట్లను చేజార్చుకున్నారు. బ్రయాన్‌ను రెండో వికెట్‌ను అశ్విన్‌ పెవిలియన్‌కు పంపితే, ఆపై పేసర్‌ మహ్మద్‌ షమీ చెలరేగిపోయాడు. 40 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను సాధించి దక్షిణాఫ్రికా టాపార్డర్‌ వెన్నువిరిచాడు.

బావుమాను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపిన షమీ.. డుప్లెసిస్‌(13), డీకాక్‌(0)లను సైతం ఔట్‌ చేశాడు.  పదునైన స్వింగ్‌తో పాటు బౌన్స్‌తో షమీ చెలరేగిపోయాడు. కాగా, మరో 10 పరుగుల వ్యవధిలో ఓపెనర్‌ మార్కరమ్‌(39),ఫిలిండర్‌(0, మహరాజ్‌(0)లను జడేజా బోల్తా కొట్టించడంతో సఫారీలు ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఒకే ఓవర్‌లో జడేజా మూడు వికెట్లు సాధించడ విశేషం. ఇంకా దక్షిణాఫ్రికా 325 పరుగుల వెనుకబడి ఉండటంతో ఇక భారత్‌ విజయం ఖాయమే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top