ఐర్లాండ్, పాక్ టెస్టు తొలి రోజు ఆట రద్దు
డబ్లిన్: టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేస్తున్న ఐర్లాండ్ జట్టును వరుణుడు అడ్డుకున్నాడు. పాకిస్తాన్తో ఇక్కడ జరుగుతున్న చరిత్రాత్మక టెస్టు తొలి రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది. పలుమార్లు పరిశీలించిన అనంతరం మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో... తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఐర్లాండ్, అఫ్గానిస్తాన్ జట్లకు కొత్తగా టెస్టు హోదా ప్రకటించింది. పాక్తో ఐర్లాండ్ అరంగేట్రం చేస్తుండగా... భారత్తో అఫ్గానిస్తాన్ వచ్చే నెలలో తొలి టెస్టు ఆడనుంది.