31 మంది డోపింగ్లో దొరికారు!
లండన్: 2008 బీజింగ్ ఒలింపిక్స్కు సంబంధించిన 454 శాంపిల్స్ను ఇటీవల పునఃపరీక్షించగా ఆరు క్రీడాంశాలకు చెందిన 31 మంది అథ్లెట్లు డోపింగ్కు పాల్పడినట్లు తేలింది. అత్యంత అధునాతన పద్ధతుల ద్వారా వీటిని పరీక్షించినట్లు చెప్పిన ఐఓసీ డోపీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాలను ఆయా దేశాల జాతీయ ఒలింపిక్ సంఘాలకు తెలియజేస్తామంది. ఈ దోషులను రియో ఒలింపిక్స్లో బరిలోకి దిగకుండా అడ్డుకుంటామంది. మరోవైపు లండన్ ఒలింపిక్స్కు సంబంధించిన 250 శాంపిల్స్ ఫలితాలను కూడా త్వరలోనే వెల్లడించనున్నారు.
సంబంధిత వార్తలు