టీమిండియా ప్రాక్టీస్ భళా..
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్లో అదరగొట్టింది. తొలిరోజు ఆటకు వరుణుడు అడ్డుపడగా, రెండో రోజు ఆటలో భారత జట్టు ప్రాక్టీస్లో భళా అనిపించింది. ఐదుగురు భారత ఆటగాళ్లు హాఫ్ సెంచరీలతో మెరిసి ప్రాక్టీస్ను సద్వినియోగం చేసుకున్నారు. టాపార్డర్లో కేఎల్ రాహుల్(3) మినహా అంతా ఆకట్టకున్నారు. పృథ్వీ షా(66; 69 బంతుల్లో 11 ఫోర్లు), చతేశ్వర పుజారా(54; 89 బంతుల్లో 6 ఫోర్లు), విరాట్ కోహ్లి(64; 87బంతుల్లో7 ఫోర్లు, 1 సిక్స్), అజింక్యా రహానే(56 రిటైర్డ్ ఔట్; 123 బంతుల్లో 1 ఫోర్), హనుమ విహారి( 53;88 బంతుల్లో 5 ఫోర్లు)లు అర్థ సెంచరీలు సాధించారు.
ఇక రోహిత్ శర్మ(40; 55 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతంగా ఆడాడు. దాంతో్ భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ ఆటముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 24 పరుగులు చేసింది. క్రీజ్లో డీఆర్సీ షార్ట్(10 బ్యాటింగ్), మ్యాక్స్ బ్రయాంట్(14 బ్యాటింగ్)లు ఉన్నారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు