కివీస్తో వన్డే : ఆదిలోనే భారత్ షాక్
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ పేసర్లు హెన్రీ, బౌల్ట్లు రెచ్చిపోవడంతో రోహిత్సేన 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. స్వల్ప స్కోర్లకే భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(2), శిఖర్ ధావన్ (6), ఫస్ట్డౌన్ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్(7) లు పెవిలియన్ చేరగా.. ఆ వెంటనే ధోని(1) సైతం క్లీన్బౌల్డ్ అయ్యాడు. తొలుత రోహిత్ శర్మను హెన్రీ క్లీన్ బౌల్డ్ చేయగా.. ధావన్ను బోల్ట్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే శుభ్మన్ గిల్ను హెన్రీ ఔట్ చేయగా.. ధోనిని బౌల్ట్.. బౌల్డ్ చేశాడు.
నాలుగో వన్డేలో బ్యాట్స్మెన్ వైఫల్యంతో రోహిత్ సేన ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు వన్డేలు గెలిచి సిరీస్ను కైవసం చేసుకున్న భారత్.. చివరి వన్డేలో గెలిచి సిరీస్ను విజయంతో ముగించాలని భావిస్తుంది. ఈ మ్యాచ్కు తుది జట్టులో మూడు మార్పులు చేసిన భారత్.. ఖలీల్, కార్తీక్, కుల్దీప్లకు విశ్రాంతినిచ్చి, వారి స్థానంలో ఎంఎస్ ధోని, షమీ, విజయ్ శంకర్లకు చోటు కల్పించింది. అయినప్పటికి కివీస్ పేసర్ల దాటికి భారత టాపార్డర్ మరోసారి విఫలమైంది. ప్రస్తుతం క్రీజులో ధోని(1), అంబటి రాయుడు(1)లు ఉన్నారు.
సంబంధిత వార్తలు