కష్టాల్లో విరాట్ సేన

india lose third wicket at 16 runs

గువాహటి:ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ 20 లో టీమిండియా విలవిల్లాడుతోంది. 16 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లి(0),మనీష్ పాండే(6)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఆసీస్ బౌలర్ జాసన్ బెహ్రెన్ డార్ఫ్ మూడు వికెట్లు సాధించి భారత్ కు కష్టాల్లోకి నెట్టాడు. తొలి ఓవర్  నాల్గో బంతికి రోహిత్ శర్మ తొలి వికెట్ గా నిష్క్రమించగా, అదే ఓవర్ చివరి బంతికి కోహ్లి డకౌట్ గా అవుటయ్యాడు.ఆపై మూడో ఓవర్ రెండో బంతికి మనీష్ పాండే పెవిలియన్ చేరాడు. జట్టు స్కోరు 27 పరుగుల వద్ద ధావన్(2) నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.  ఈ మ్యాచ్ లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. ఆశిష్ నెహ్రాకు ఈ మ్యాచ్ లో అవకాశం కల్పిస్తారని భావించినా.. భారత్ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా గత జట్టునే కొనసాగించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top