టీమిండియా 172 ఆలౌట్

India bowled out for 172 - Sakshi

కోల్ కతా:శ్రీలంకతో ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 172 పరుగులకు ఆలౌటైంది. 74/5 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 98 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లను నష్టపోయింది.

ఓవర్ నైట్ ఆటగాడు పుజారా(52; 117 బంతుల్లో10 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించిన తరువాత ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు.ఆపై సాహా(29), జడేజా(22), షమీ(24)లు ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో లక్మల్ నాలుగు వికెట్లు సాధించగా,గామేజ్, షనక, పెరీరాలు తలో రెండు వికెట్లతో భారత్ ను కట్టడి చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top