పాక్‌దే వన్డే సిరీస్‌

Imam's debut 100, Hasan's five propel Pakistan to ODI series win - Sakshi

అబుదాబి: శ్రీలంక చేతిలో టెస్టు సిరీస్‌ను 0–2తో కోల్పోయిన పాకిస్తాన్‌ జట్టు వన్డే సిరీస్‌లో మాత్రం అదరగొట్టే ప్రదర్శన చేస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే పాకిస్తాన్‌ 3–0తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. తొలుత శ్రీలంక 48.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ బౌలర్లలో హసన్‌ అలీ 34 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా... షాదాబ్‌ ఖాన్‌ 38 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

శ్రీలంక ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ ఉపుల్‌ తరంగ (61; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 209 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్‌ 42.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ (125 బంతుల్లో 100; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించి పాక్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top