పాండ్యా, రాహుల్కు భారీ ఊరట
ముంబై: టీవీ టాక్ ‘షో’లో మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, లోకేశ్ రాహుల్లకు భారీ ఊరట లభించింది. వీరిద్దరిపై విధించిన నిషేధాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం ఎత్తివేసింది. అమికస్క్యూరీ పీఎస్ నరసింహాతో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకునట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. వీరిద్దరిపై ఈనెల 11 నుంచి అమల్లోకి వచ్చిన నిషేధాన్ని తక్షణమే ఎత్తివేస్తున్నట్టు తెలిపింది.
అడ్డంకులు తొలగిపోవడంతో హార్దిక్, రాహుల్.. న్యూజిలాండ్లో ఉన్న భారత క్రికెట్ జట్టులో చేరే అవకాశముంది. ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో పాండ్యా, రాహుల్ అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడటంతో వీరిద్దరిపై బీసీసీఐ క్రమశిక్షణ చర్య తీసుకున్న సంగతి తెలిసిందే. తాను చేసిన వ్యాఖ్యలపై హార్దిక్ పాండ్యా ఇప్పటికే క్షమాపణలు వేడుకున్నాడు. (వాళ్లు తప్పు చేశారు)
మీ అభిప్రాయం చెప్పండి
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు